TG: కవులు, మేధావులతో చర్చించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. తెలంగాణ తల్లిని చూస్తే ఉద్యమకారులు గుర్తొస్తారని తెలిపారు. తమకు గడీల తల్లి కాదని.. గరీబోళ్ల తల్లి కావాలన్నారు. తెలంగాణ తల్లిని ప్రజలందరూ ఆమోదిస్తే కొందరు మాత్రం రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.