ప్రకాశం: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పామూరుకు వస్తున్నట్లు మండల టీడీపీ నాయకులు తెలిపారు. రేపు పామూరులో సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు.