కోనసీమ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలబాలికల బాస్కెట్ బాల్ క్రీడాకారుల ఎంపికలు ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యాలరావు తెలిపారు. సోమవారం రామచంద్రపురంలోని కంతేటి పేర్రాజు క్రీడా ప్రాంగణంలో ఎంపికలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు 2011 జనవరి ఒకటో తేదీ తర్వాత పుట్టిన వారి అర్హులని తెలిపారు.