కోనసీమ: ఆత్రేయపురంలో ఆదివారం జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతను అందరూ పాటించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పారిశుధ్య పనుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.