VSP: సింహాచలం ఆలయ కార్యనిర్వహణాధికారిగా వి.త్రినాథరావు ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. తర్వాత ఆలయ ఇంచార్జ్ ఈవో సుజాత ఆయనకు బాధ్యతలు అప్పగించారు.