కోనసీమ: అమలాపురంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ అపవిత్రమైన ఘటనకు కారణమైన దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ దళ్ సంఘాల నాయకులు శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్ నుంచి వారు నిరసన ర్యాలీ నిర్వహించారు. దోషులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.