కృష్ణా జిల్లా: వత్సవాయి మండలం పెంట్యాలవారిగూడెంలోని రెడ్డిచెరువు వేలం లీజు పాటను ఈనెల 24న నిర్వహించనున్నారు. వేలంపాటను గ్రామపంచాయితీ కార్యాలయంలో నిర్వహిస్తామని పెంట్యాలవారిగూడెం సర్పంచ్ పరమయ్య ప్రటన విడుదల చేశారు. వేలంలో పాల్గొనేవారు ముందుగా రూ.లక్ష డిపాజిట్ చెల్లించాలని, మూడేళ్లలీజుకు సంబంధించి హెచ్చు పాటదారుగా నిలిచినవారు ఏడాది లీజు మొత్తాన్ని చెల్లించాలని తెలిపారు.