కృష్ణా జిల్లా: ఇటీవల కృష్ణా వరదలు, అధిక వర్షాల కారణంగా ముంపుకు గురైన పంట పొలాలు నేడు సాగునీరు అందక నెరలిస్తున్నాయి. మోపిదేవి మండలంలోని పెద్దకళ్లేపల్లి పంచాయతీ పరిధిలో సాగునీరు అందక వరి పంటలు నెరలిచ్చాయి. 11/1 నుంచి 11/4 బ్రాంచ్ కాలువల ద్వారా భూములకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ కాలంలో నుంచి నీరు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు.