కృష్ణా జిల్లా: నందిగామలో మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవికి కొందరు పేర్లు పార్టీ అధిష్ఠానం ముందు ఉంచినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే అందరికంటే ముందు వరుసలో మాజీ జడ్పీటీసీ వాసిరెడ్డి ప్రసాద్ పేరు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నాయకులు చెబుతున్నారు. దీంతో ఆ పార్టీ సీనియర్ నాయకుల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది.