తూ.గో: దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం ఇంకా వరద నీటిలోనే ఉందని, భక్తులెవరూ దర్శనాలకు రావద్దని దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. ఆదివారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గోదావరి వరద ఉద్ధృతంగా ఉందని, అమ్మవారి ఆలయం చుట్టూ వరద నీరు ఉందని తెలిపారు. ఆలయంలోకి వెళ్లడానికి మార్గం లేదని పేర్కొన్నారు.