PLD: నేడు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాలలో పర్యటించనున్నారని మండల స్థాయి నాయకులు శనివారం తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మండలంలోని కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.