PDPL: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా, పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో మంథనిలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ప్రారంభించారు. కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.