NGKL: ఊర్కొండ మండలం ఊర్కొండపేట గ్రామంలో ఛత్రపతి శివాజీ వర్ధంతి వేడుకలు గ్రామస్థులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రేపని శ్రీనివాసులు శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని, స్వరాజ్యాన్ని రక్షించిన వారు శివాజీ అని, ఆయన చూపిన బాటలో నడవడం మన బాధ్యత అని పేర్కొన్నారు.