తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ను సీఎం రేవంత్రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు.
Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ను సీఎం రేవంత్రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తులను మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్ష తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. అభ్యర్థుల వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 46 ఏళ్లగా నిర్ధారించారు. గతేడాది సెప్టెంబరు 6న 5,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.