హైదరాబాద్లో సుప్రీం కోర్టు (Supreme Court) ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కోరారు.ఈ మేరకు ఆయన శుక్రవారం లోక్సభలో ప్రైవేటు మెంబర్ బిల్లు (Private Member’s Bill) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఐదుగురు జడ్జీలకు తగ్గకుండా పర్మినెంట్ బెంచ్ ఏర్పాటు చేయాలి. కేసుల సత్వర పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుంది.దేశప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉండే హైదరాబాద్ బెంచ్ పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, కేరళతో పాటూ కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, దాద్రానగర్ హవేలీ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులను చేర్చాలి’’ అని కోరారు.ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో పెండింగులో ఉన్న కేసుల సంఖ్యను కూడా ఎంపీ రంజిత్ రెడ్డి (MP RanjithReddy)ప్రస్థావించారు.
సుప్రీంకోర్టులో ప్రస్తుతం 70 వేల కేసులు పెండింగులో ఉన్నాయని, కోర్టులో జడ్జిల (judges) సంఖ్య 33 మాత్రమే ఉందని, ఈ లెక్కన ప్రతి జడ్జి సుమారు 6 వేల కేసులను పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు.ఈ సిఫార్సుల వెనుక కారణం సుదూర ప్రాంతాల నుంచి సుప్రీంకోర్టు వరకు కక్షిదారు (Clients) చేరుకోలేకపోవడమేనని రంజిత్ రెడ్డి తెలిపారు. ఫలితంగా.. చాలా కేసుల్లో కక్షిదారులు హైకోర్టు దశలోనే ఆగిపోతున్నారని.. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించలేకపోతున్నారని తెలిపారు.ఢిల్లీకి సమీపంలో ఉన్న పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) వంటి రాష్ట్రాల కేసులే ఎక్కువగా సుప్రీం వరకూ వస్తున్నాయని..కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు వరకు వస్తున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS) ఎంపీ లోక్ సభలో వెల్లడించారు.