PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి యూనిట్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన సత్యనారాయణ హోంగార్డును పోలీస్ కమిషనర్ ఆత్మీయంగా సన్మానించారు. పోలీస్ కమిషనరేట్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యనారాయణకు శాలువా కప్పి ఆత్మీయంగా వీడ్కోలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, AR-ACP ప్రతాప్, RI పెద్దన్న,అధికారులు పాల్గొన్నారు.
JGL: కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ఎంఈవో గంగుల నరేశం సమావేశమయ్యారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు ఉన్నందున, మధ్యలో వచ్చే సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ, పోషకాహారం తీసుకోవాలని సూచించారు.
KNR: జమ్మికుంటలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో హేమలత తెలిపారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరగనున్న పరీక్షల కోసం జమ్మికుంటలో ఐదు, వావిలాలలో ఒకటి కలిపి మొత్తం ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు పరీక్షకు 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరాలన్నారు.
PDPL: రామగుండం ‘మగువ’ లయన్స్ క్లబ్ 2026-27 సంవత్సరానికి గాను గోదావరిఖనికి చెందిన అర్చన రావు (ఇరిగేషన్ విభాగంలో ఇంజినీర్)అధ్యక్షురాలుగా ఎన్నికైంది. గోదావరిఖనిలో గురువారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో మహిళ సాధికారత, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, మహిళా అభ్యున్నతికి కృషి చేస్తామని అర్చన తెలిపారు.
JGL: నేరాల నివారణతో పాటు జరిగిన నేరాలను వేగంగా ఛేదించి బాధితులకు న్యాయం అందించేందుకు పోలీస్ అధికారులు పని చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ క్రైమ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు.
HYD: తెలంగాణా ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక అడుగువేస్తోంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, MLCలు కోదండరాం, అద్దంకి దయాకర్తో మినిస్టర్ క్వార్టర్స్లో భేటీ అయ్యారు. సమస్యల పరిష్కారానికి, హామీల అమలుకు ఒక సమర్థవంతమైన కమిటీని ఏర్పాటు చేసి, వారి డిమాండ్లపై సమగ్ర అధ్యయనం చేయాలని నేతలు భావించారు.
JGL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ లింబాద్రి అన్నారు. మెట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదరాన్ని తొలగించి చెత్త ఆటోలో తరలించారు.
RR: FCI కాలనీ పార్కులో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మహిళల కోసం నిర్వహించిన మ్యూజికల్ చైర్, తగ్ ఆఫ్ వార్ వంటి పలు క్రీడా పోటీల్లో 500 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు రూ.5,000, రూ.3,000 విలువైన బహుమతులు ఇచ్చారు.
VKB: ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం మర్చిపోయిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. ఫిక్స్డ్ వేతనం చేస్తామని రూ.18 వేలు ఇస్తామని ఈఎస్ఐ, పీఎఫ్ ఉద్యోగ భద్రత రూ.50 లక్షల ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
WGL: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేరూ వినిపిస్తున్నట్లు సమాచారం. పార్టీ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేసి గెలుపొందిన సీనియర్ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందాడు.
MLG: మల్లంపల్లి మండల కేంద్రంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. శివం గార్డెన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వేగంగా వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KNR: వీణవంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు ఎఫ్పీవో సభ్యత్వం పొందాలని సంఘం కార్యదర్శి చందుపట్ల ప్రకాశ్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం రూ. 300తో సొసైటీ సభ్యులుగా ఉన్న వారు రూ. 2000 చెల్లించి ఎఫ్పీవో సభ్యత్వం తీసుకోవచ్చన్నారు. ఎఫ్పీవో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఎన్సీడీసీ ద్వారా ప్రతి సంవత్సరం రూ. 2000 ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో ‘జనగణన-2027’ హౌస్లిస్టింగ్ ప్రక్రియపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సర్వేను డిజిటల్ పద్ధతిలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, తహశసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ప్రభుత్వ సిబ్బంది పాల్గొని కీలక సూచనలు అందుకున్నారు.
MDCL: మేడిపల్లి పరిధిలోని సాయి ప్రియ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామస్వామి (శివాలయం & రామాలయం) దేవాలయ నిర్మాణ పనులకు పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి రూ. 1,00,116లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవచింతన సమాజంలో శాంతిని, ఐకమత్యం పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందారు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ GP పరిధిలోని ఎర్రారం గ్రామానికి చెందిన దూదేకుల జాంగిర్ జీవన ఉపాధి కోసం మెదక్ వెళ్లి సోడాలు అమ్ముకుంటు ఉండేవాడు. మద్యానికి బానిసై పోచారం డ్యామ్లో పడి సూసైడ్ చేసుకున్నట్లు అతని భార్య శన్ను పోలీసులకు ఫిర్యాదు చేశారు.