• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్నిప్రమాదం

NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు సీజ్ చేసిన బైక్‌లు, ఆటోలు, కార్లు దగ్ధమయ్యాయని సీఐ సత్యనారాయణ తెలిపారు. చెత్తకు నిప్పు పెట్టడంతో అది ప్రమాదవశాత్తు వచ్చి స్టేషన్ ఆవరణలోని వాహనాలకు వ్యాపించిందన్నారు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి మంటలు ఆర్పి వేశారని పేర్కొన్నారు.

March 12, 2026 / 07:22 PM IST

మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

KMM: మైనారిటీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మసీదు కమిటీలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లు, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ముస్లిం మహిళలకు గురువారం వారు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 200 కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.

March 12, 2026 / 07:22 PM IST

పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

ASF: తీర్యాని మండల ఆశ్రమ హైస్కూల్‌లో “పోలీసులు మీ కోసం” కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు అందజేసి, వారు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. పోలీసుల ఈ చొరవపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

March 12, 2026 / 07:18 PM IST

ప్రభుత్వ చౌక దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ చౌకధరల దుకాణాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు అవసరమైన బియ్యం నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందరూ చక్కగా వినియోగించుకోవాలని తెలిపారు.

March 12, 2026 / 07:15 PM IST

జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ

NLG: ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారు ఇటీవల హైదరాబాద్‌లో సెకండ్ లెవెల్‌లో నిర్వహించిన మ్యాథ్స్ ఒలంపియాడ్ పరీక్షలో దామర‌చర్లలోని ఎస్‌పీఆర్ పాఠ‌శాల‌కు చెందిన 3వ‌ తరగతి విద్యార్థిని సోమ శివాన్సిక జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. భారతీయ విద్యా భవన్‌లో బుధవారం పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.

March 12, 2026 / 07:10 PM IST

‘ప్రభుత్వం రైతులను విస్మరిస్తుంది’

SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరిస్తుందని బీఆర్ఎస్ నేతలు వేణు, హరీశ్ ఆరోపించారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్ శివారులో కాలువ పనులను మాజీ మంత్రి హరీశ్ రావు తన సొంత ఖర్చులతో పూర్తి చేయించారు. దీనితో గుర్రాలగొంది, గంగాపూర్ రైతుల పంట పొలాలకు సాగు నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ హరీశ్ రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.

March 12, 2026 / 07:10 PM IST

కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం జరుగుతుంది: MLA

WGL: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ SC విభాగం రాష్ట్ర ఛైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన మానకొండూరు MLA డా. కవ్వంపల్లి సత్యనారాయణ గాంధీభవన్‌లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో MLA KR నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.

March 12, 2026 / 07:05 PM IST

రైలులో బ్యాగు చోరీపై జీరో ఎఫ్ఎఆర్

HYD: రైలులో ప్రయాణికుడి బ్యాగు చోరీపై కాచిగూడ రైల్వే పోలీసులు జీరో ఎఫ్ఎఆర్ నమోదు చేశారు. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరుకి చెందిన సురేశ్ పురి(37) కాచిగూడకు రావడానికి రాజస్థాన్‌లోని ఓ స్టేషన్‌లో రైలు ఎక్కాడు. రైలు నాందేడ్ వద్దకు రాగానే బ్యాగు కనిపించలేదన్నాడు. బ్యాగులో 10 గ్రాముల 2 బంగారు ఉంగరాలు, బట్టలు, ఆధార్ కార్డు ఉందన్నారు.

March 12, 2026 / 07:04 PM IST

ఉద్యమకారుల డిమాండ్లపై ఎమ్మెల్యేకు మెమొరాండం

MBNR: జిల్లా కేంద్రంలో MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారులు మెమొరాండం అందజేశారు. ఫిబ్రవరి 23, 2026 హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 5 ఎకరాల సాగు భూమి, పింఛన్, ఐడీ కార్డు ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని 16 మార్చి తెలంగాణ అసెంబ్లీలో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.

March 12, 2026 / 07:02 PM IST

MRO కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీసీఎల్ఏ కమిషనర్

SRD: కంది తహసీల్దార్ కార్యాలయాన్ని సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను కాపాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు.

March 12, 2026 / 07:02 PM IST

ఫ్లై ఓవర్ పైనుంచి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

KNR: జమ్మికుంట పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని సుమారు 28 ఏళ్ల యువకుడు ఆర్వోబీ సమీపంలోని ఫ్లైఓవర్ పై నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

March 12, 2026 / 07:02 PM IST

పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

GDWL: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలో 40 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 8,110 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇందులో బాలికలు 4,199 మంది బాలురు, 3,858 మంది, 53 మంది ఒకసారి విఫలమైన విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

March 12, 2026 / 07:02 PM IST

క్రమశిక్షణతోనే ఉన్నత లక్ష్యాలు సాధ్యం: ట్రైనీ ఐపీఎస్

SDPT: విద్యార్థులు క్రమశిక్షణను అలవాటు చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ట్రైనీ ఐపీఎస్ ఆయేషా ఫాతిమా సూచించారు. కొండపాక మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన “రోల్ మోడల్‌తో సంభాషణ” కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో పాఠశాల విద్యకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

March 12, 2026 / 07:02 PM IST

బాధితులను పరామర్శించిన MLA

ADB: నేరడిగొండ మండలంలోని బోరిగాం గ్రామంలో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఇంటి బాధ్యులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. ఈ సందర్బంగా జాదవ్ ప్రేమ్ సింగ్ ఇల్లు మంటతో పూర్తిగా కాలిపోవడంతో తక్షణ సహాయం కింద రూ. 30,000 అందజేశారు. అదేవిధంగా నిత్యవసరుకులు పంపిణి చేశారు. ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ ఇల్లు మంజూరు చేసే బాధ్యత తమదని హామీచ్చారు.

March 12, 2026 / 07:02 PM IST

విద్యార్థుల రాజకీయ పార్టీ కార్యవర్గ సమావేశం

PDPL: రామగుండం NTPC పార్టీ కార్యాలయంలో గురువారం విద్యార్థుల రాజకీయ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం విద్యార్థుల రాజకీయ పార్టీ కృషి చేస్తుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మన్మోహన్ తమ్మెర పేర్కొన్నారు. అనంతరం పార్టీ రామగుండం మున్సిపాలిటీ ఏరియా ఇంఛార్జ్‌గా మనాల భవాని శంకర్‌ను నియమించారు.

March 12, 2026 / 07:01 PM IST