HNK: కలెక్టరేట్లో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి శిక్షణ కార్యక్రమానికి హాజరై ప్రజా ప్రతినిధులకు పలు సూచనలను చేశారు. 99 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజల స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నారు.
WNP: అమరచింత మున్సిపాలిటీ 8వ వార్డు పెద్ద పీర్ల మసీద్ వద్ద మంచినీటి పైపులైన్ లీకేజీతో కాలనీవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్డుపై బురద పేరుకుపోయి, రాత్రివేళ దుర్వాసన, దోమల బెడద పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైన్ మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
NLG: మునుగోడు మండలంలోని కలవలపల్లిలో ఎండిపోయిన వరి పంటలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలను తెలుసుకున్నారు. రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తామని ఆయన హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, నాయకులు పాల్గొన్నారు.
KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మధిర మున్సిపల్ ఛైర్పర్సన్ సామినేని సుజాత- రామనాథం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మధిర పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల మంజూరుపై డిప్యూటీ సీఎంతో చర్చించారు.
NGKL: బల్మూర్ మండలం చెన్నారంలో ఉపాధి హామీ కూలీలతో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సమావేశమయ్యారు. కూలీలకు రోజుకు 600 రూపాయల వేతనం చెల్లించాలని, ఏటా 200 రోజుల పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూలీల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న విబిరాంజీ బిల్లును తక్షణమే రద్దు చేయాలని నాయకులు మల్లేష్, శంకర్ నాయక్ కోరారు.
ADB: భోరజ్ మండలంలోని బాలాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు, బీజేపీ నాయకులు తదితరులున్నారు.
MHBD: పట్టణంలో గురువారం ఉదయం పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాలు, గంజాయి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, మత్తు పదార్థాల వినియోగం దృష్టికి వస్తే తమకి తెలియజేయాలని, మున్సిపల్ సిబ్బందిని, ప్రజలను కోరారు.
RR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్ చికెన్ షాప్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చికెన్ షాపుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త లైసెన్సింగ్ విధానం తెస్తోందని, నాణ్యతతో పాటు పరిశుభ్రత ఉన్న మాంసం అమ్మకాలు జరపాలని సూచించారు.
NZB: నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఇమ్మడి గోపి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితుడు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గోపీని హతమార్చింది సమీప బంధువు, వరుసకు మేనల్లుడైన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
SRCL: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని గీత నగర్ ప్రభుత్వ పాఠశాలలో టాస్క్ ఫోర్స్ సీఐ నటేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలన్నారు విద్యార్థులు పాల్గొన్నారు.
KMM: నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఈనెల 16న జిల్లా కేంద్రాలలో, 23న సెంట్రల్ లేబర్ ఆఫీస్ హైదరాబాద్లో జరిగే మహా ధర్నాలను జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షులు షేక్ సుభహన్ పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం ఖమ్మం బల్లేపల్లిలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత వర్గాల కొమ్ముకాస్తూ అదానీ, అంబానీకి దేశ సంపద అప్పచెబుతుందన్నారు.
మంచిర్యాల: క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్స్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. శిక్షణ తరగతులను కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, DCP భాస్కర్ ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని తెలిపారు.
HYD: ఆర్థిక, రాజకీయ రంగాల్లో విశిష్ట ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి భౌతిక కాయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. వారి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
PDPL: ధర్మారం మండల కేంద్రంలో ఇవ్వాల నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం రెండు కేంద్రాలలో కలిపి 519 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా, 509 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు.
VKB: బీజేపీ రాష్ట్ర డాక్టర్ సెల్ కన్వీనర్గా వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఆయనకు నియామక పత్రం అందజేసింది. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ, వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.