తెలంగాణలో సంచలనంగా మారిన టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో పోలీసులు బండి సంజయ్ ని ఏ1గా రిమాండ్ రిపోర్టులో ప్రకటించారు. ఏ2గా ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4 శివగణేష్ గా పేర్కొన్నారు.
Hanuman Jayanthi : హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభయాత్రకు ఇప్పటికే హిందూ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
మనమంతా పదో తరగతి పరీక్షలు రాసే ఇక్కడకు వచ్చామని, పరీక్ష ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని, కానీ అరగంటలో అది లీక్ కావడం ఏమిటని రఘునందన రావు ప్రశ్నించారు.
Minister Koppula Eshwar : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ను ఎట్టకేలకు పోలీసులు ధృవీకరించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, వాట్సాప్ లలో ప్రచారం అంశంలో ఆయన హస్తం ఉందని తెలిపారు. వాటి ఆధారంగానే 5 సెక్షన్ల కింద బండిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
దేశంలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) తర్వాత దళిత వర్గాలకు ఆ స్ధాయి మహా వ్యక్తి బాబూ జగ్జీవనరామ్(Babu Jagjivanaram) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువుగా దళిత బందు పధకాన్ని అమలు చేస్తున్నరని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. దళితుల అభ్యున్నతికి తన జీవితాంతం పాటుపడిన జగ్జీవన్ రామ్ జయంతి జరుపుకుంటున్నామని చెప్పారు.
ప్రశ్నాపత్రాల లీకేజీలో బండి సంజయ్ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా బీజేపీ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అరెస్టు గురించి రాష్ట్ర డీజీపీకి తెలియకపోవడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. సంజయ్ ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డీజీపీకి ఫోన్ చేస్తే తర్వాత వివరాలు చెప్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ (BJP) ప్రయత్నింస్తోందని బీఆర్ఎస్ (BRS)నేతలు మండిపడుతున్నారు.హిందీ పేపర్ను బండి వాట్సాప్కు పంపించడం కుట్ర కాదా ? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్ట్పై కేటీఆర్ ట్విట్టర్ (KTR Tweet) వేదికగా స్పందించారు. బండి అరెస్ట్పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్ను రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.
Raja Singh : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టును బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా... బండి అరెస్టుపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు.
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అక్రమ అరెస్ట్పై తెలంగాణ హైకోర్టు (High Court) లో తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ (BJP Legal Cell) పిటిషన్ను దాఖలు చేసింది. బండి సంజయ్ ను అరెస్ట్ను వ్యతిరేకిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్(Habeas Corpus Petition) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. కాగా, సంజయ్ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర...
Telangana Govt : ఈరోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని తహతహలాడేవారే. దాని కోసం సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఈ రీల్స్ చేసి... డబ్బు సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) ఆంక్షలు విధించారు. ఈ నెల 6న నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. దుర్గం చెరువు(Durga Lake) కేబుల్ సిస్టమ్ పనుల తనిఖీలో భాగంగా వంతెనపై భారీ క్రేన్ను ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్ను మూసివేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ ల...