HYD: అశోక్ నగర్లో గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న సురేఖ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా గాంధీ ఆసుపత్రిలో సురేఖ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు కూతురు మృతదేహాన్ని చూసిన సురేఖ తల్లి బోరున విలపించారు. ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
KMM: ముదిగొండ మండలం గంధసిరిలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ శిబిరంలో 35 గేదెలకు గర్భకోశ చికిత్స చేసినట్లు మండల పశు వైద్యాధికారి అశోక్ తెలిపారు. పశువులకు వచ్చే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు మండల పశువైద్యాధికారి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
BDK: కరకగూడెం మండల పరిధిలోని ప్రాథమిక వైద్యశాలలో నూతన 102, అంబులెన్స్లను మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు DMHO భాస్కర్ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రికి అంబులెన్స్ కేటాయించాలంటే ఎన్నో ఇబ్బందులకు గురి చేసే వారిని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఇబ్బందులు లేకుండా చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
MBNR: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్ల వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
NZB: HYD అశోక్ నగర్లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న గుగులోతు సురేఖ (22) ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి (D) గాంధారి (M) సోమారం తండాకు చెందిన సురేఖకు NZBకు చెందిన అబ్బాయితో గత నెలలో ఎంగేజ్మెంట్ అయింది. కాగా కుటుంబ సమస్యలతో నిన్న సూసైడ్ చేసుకుంది అన్నారు.
HYD: మైనర్లు బైక్, కార్లు నడపడం తగదని హైదరాబాద్ MP అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు బండ్లగూడలోని ఆర్టీఏ కార్యాలయానికి మంగళవారం ఒవైసీ వచ్చారు. ఈ సందర్భంగా రెన్యువల్కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం ఒవైసీ మీడియాతో మాట్లాడారు. మైనర్లు వాహనాలు నడపడం తగదని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలన్నారు.
NRML: కుబీర్ మండలం పార్డీ B గ్రామంలోని శ్రీ రాజా రాజేశ్వర ఆలయంలో చోరీకి యత్నించిన భైంసాకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం భైంసా ASP కార్యాలయంలో ఏఎస్పీ అవినాష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి ఆలయంలో చోరీకి యత్నించగా CC ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు తెలిపారు.
SRPT: నడిగూడెం మండలం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కాగిత రామచంద్రాపురం ఆధ్వర్యంలో అందజేస్తున్న దీర్ఘకాలిక బోనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఛైర్మన్ రాజేష్ అన్నారు. మంగళవారం రైతు లావూరి శ్రీనివాస్కు పౌల్ట్రీ మొదటి దఫగా 7,20,000లోన్ చెక్కుని పిఎస్ఎస్ కార్యాలయంలో రైతుకు అందజేశారు.
KMR: డోంగ్లీ మండలంలోని సిర్పూర్, టాక్లి గ్రామ శివారులో అక్రమ ఇసుక డంపులను సీజ్ చేసినట్లు తహశీల్దార్ రేణుక చౌహాన్ తెలిపారు. సోమవారం రాత్రి 20 ట్రాక్టర్ల అక్రమ ఇసుక పట్టుకున్నామన్నారు. పట్టుబడిన ఇసుకను ఈ నెల 28న ఉదయం 11.30 గంటలకు డోంగ్లి తహశీల్దార్ కార్యాలయంలో వేలం వేస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనాలని సూచించారు.
SRPT: నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ కాలువకు ఇటీవల గండి పడడంతో యుద్ధ ప్రాతిపదికన గండి పనులు పూర్తిచేసి ఆయకట్టు రైతులకు సాగునీరును అధికారులు అందజేశారు. గండికి చేపట్టిన మరమ్మతు పనులను క్వాలిటీ కంట్రోల్ టీంతో ఇంజనీరింగ్ ఆఫ్ చీఫ్ అనిల్ కుమార్ మంగళవారం పరిశీలించారు.
HYD: అశోక్ నగర్లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్-2, రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న గుగులోతు సురేఖ(22) ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు తెలిపిన వివరాలు.. కామారెడ్డి (D) గాంధారి(M) సోమారం తండాకు చెందిన సురేఖకు నిజామాబాద్కు చెందిన అబ్బాయితో గత నెలలో ఎంగేజ్మెంట్ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న పెళ్లి కూడా నిశ్చయమైంది.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ADB: ఉమ్మడి జిల్లాకు చెందిన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు తలపెట్టిన సమ్మె నేటికి 9వ రోజుకు చేరుకుంది. సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, తుడుందెబ్బ, వివిధ సంఘాలు సంఘీభావం తెలిపాయి. 9 రోజులవుతోన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటని ఉద్యోగులు మండిపడ్డారు.
HYD: సికింద్రాబాద్ పారడైజ్ సర్కిల్ నుంచి బేగంపేట్ వెళ్లే రహదారి ఇరువైపులా ఫుట్ పాత్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పాదచారులు రోడ్డుపై నడవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాదచారుల సౌలభ్యం కోసం GHMC కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తోంది. ఫుట్ పాత్ ఆక్రమణ సమస్య అలాగే కొనసాగుతోంది, సికింద్రాబాద్ మధ్యలో పలుచోట్ల రోడ్లను బాగు చేయాలని స్థానికులు కోరారు.
KNR: హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని గోలిపల్లి అంజలి హుజురాబాద్ ఎంజేపీ బాలికల పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుకుంటోంది. బీహార్ రాష్ట్రంలో పాతేనాలో ఈనెల 28 – 30 వరకు జరగనున్న జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు ఎంజేపీ పాఠశాల ప్రిన్సిపల్ రాగమణి తెలిపారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
NLG: రోజురోజుకూ పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్యుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వానాకాలంలో జిల్లా వరి ఉత్పత్తి పెరిగినా కొత్త బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం నల్గొండ మార్కెట్లో సన్నబియ్యం కిలో రూ50 నుంచి 75కు పెరిగింది. జిల్లాలో దిగుబడులు పెరిగినా. ధరలు తగ్గాల్సి ఉండగా ఎక్కడా ఆ పరిస్థితులు కనిపించడం లేదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.