• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

ADB: పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులను నాయకులతో కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు తదితరులున్నారు.

December 26, 2024 / 06:26 PM IST

ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కళ్యాణి నియామకం

SDPT: జిల్లాలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పుల్ల కళ్యాణి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి రెండవసారి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించినందుకు కళ్యాణి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సమస్యల కోసం ఎల్లవేళల కృషి చేస్తానన్నారు.

December 26, 2024 / 06:16 PM IST

‘న్యాయవాదులు ఇ-ఫైలింగ్ చేసుకోవాలి’

NZB: నిజామాబాద్ బార్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న జిల్లా న్యాయవాదులు ఇ-ఫైలింగ్ చేసుకోవాలని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌రెడ్డి  కోరారు. గురువారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇ- కోర్టు వెబ్‌సైట్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.

December 26, 2024 / 06:10 PM IST

గీత కార్మికుల హామీలు నెరవేర్చాలి: వెంకటరమణ

NLG: కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ అన్నారు. నల్గొండలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించి 22 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.

December 26, 2024 / 06:10 PM IST

పంచాయతీ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలి: సీఐటీయు

BDK: జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేపు నిర్వహించబోయే.. టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. గురువారం పంచాయతీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుంచి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించేంత వరకు సమ్మె చేయాలని కోరారు.

December 26, 2024 / 06:08 PM IST

ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి

మహబూబ్ నగర్: హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు రవిందర్ సతీమణి ఎల్ శారద ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు సాధించారు. ఈ సందర్భంగా వారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా గురువారం కలిసి పుష్పగుచ్చం అందించారు.

December 26, 2024 / 05:57 PM IST

రంగంలోకి రెస్క్యూ టీం

MHBD: తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామంలో ఉదయం క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు జారిపడ్డ యువకుడి గాలింపు కోసం ఫైర్ సిబ్బందితో పాటు ఈతగాళ్లు రంగంలోకి దిగారు. స్థానికులు వీరికి సహాయకంగా తెప్పను తెప్పించారు. కాగా అమ్మాపురం స్థానిక ముదిరాజులు కూడా నీటిలోకి దిగి బాధిత యువకుడి కోసం గాలిస్తున్నారు.

December 26, 2024 / 05:56 PM IST

మృతులకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి

MDK: రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా విద్యుత్ వైర్ల కింద కట్టిన ఫ్లెక్సీల తీస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతి చెందిన నవీన్, ప్రశాంత్ కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మా దేవేందర్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి చెరో రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు.

December 26, 2024 / 05:52 PM IST

‘నిందితుడికి కఠినంగా శిక్షించాలి’

ABD: గుడిహత్నూర్ మండల కేంద్రంలో మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడికి కఠినంగా శిక్షపడేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి అన్నారు. గురువారం బాధిత కుటుంబాని మహిళా కమిషన్ సభ్యురాలు పరామర్శించారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

December 26, 2024 / 05:50 PM IST

వారికి ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలి: రాజేష్ నాయక్

WGL: కొడకండ్లలో ఎల్‌హెచ్‌పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు గుగులోతు వీరేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ పాల్గొని మాట్లాడారు. మైదాన ప్రాంత లంబాడీల అభివృద్ధి కోసం ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో బ్యాక్‌లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

December 26, 2024 / 05:48 PM IST

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ప్రతిమ, జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్, సమన్వయంతో నిరుద్యోగ యువతీ యువకుల కొరకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగారం సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, ప్రతిమ ఫౌండేషన్ శ్యామల, చందుర్తి మండల కోఆర్డినేటర్ శ్రీలత, పరమేష్‌లు హాజరై ఉచిత శిక్షణ మరియు ఉద్యోగావకాశాల గురించి వచ్చిన వారికి వివరించారు.

December 26, 2024 / 05:48 PM IST

మహబూబాబాద్ పురవీధుల్లో సీపీఐ కార్యకర్తల ర్యాలీ

MHBD: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నేడు సీపీఐ పార్టీ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పురవీధుల్లో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారధి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు చేతపట్టి పురవీధుల్లో కదం తొక్కారు అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి 100 సంవత్సరాల్లో జరిగిన పోరాట స్ఫూర్తిని కార్యకర్తలకు ఆయన వివరించారు.

December 26, 2024 / 05:43 PM IST

‘అరుణోదయ అర్థ శతాబ్ది సభను జయప్రదం చేయండి’

KMM: వైరాలో ఈనెల 31న నిర్వహించే అరుణోదయ అర్థ శతాబ్ది సభను జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ మహిళా నేతలు కోరారు. గురువారం కోరట్లగూడెం గ్రామంలో అరుణోదయ అర్థ శతాబ్ది సభకు సంబంధించిన కరపత్రాలను మహిళా నేతలు ఆవిష్కరించారు. అరుణోదయ అర్థ శతాబ్ది సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పేర్కొన్నారు.

December 26, 2024 / 05:41 PM IST

‘సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి’

MNCL: సింగరేణి కార్మికుల సొంతింటి పథకం కల త్వరలో సాకారం కాబోతుందని తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. గురువారం శ్రీరాంపూర్‌లో 2025 INTUC క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పెర్క్స్ పై ఐటీ రద్దు, తదితర సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.

December 26, 2024 / 05:33 PM IST

‘కాకతీయ కెనాల్ ద్వారా ఎర్గట్ల మండల చెరువులు నింపాలి’

NZB: కాకతీయ కెనాల్ ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది కావున ఏర్గట్ల మండలంలో కాకతీయ కెనాల్ నుంచి డి. 18,19,20 డిస్ట్రిబ్యూటరీ కేనాల్స్ ద్వారా చెరువులు నింపాలని సి.ఈ. సుధాకర్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. MLA మాట్లాడుతూ.. వారం రోజుల్లో డి.18,19,20 కేనాల్స్ ద్వారా చెరువులు నింపాలని లేకుంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామన్నారు.

December 26, 2024 / 05:33 PM IST