• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేర నియంత్రణే ధ్యేయం: ఎస్పీ

JGL: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వార్షిక సంవత్సర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా నేర నివేదికను విడుదల చేశారు. సమర్థవంతమైన నాయకత్వంతో జిల్లా పోలీస్ అధికారులు పనిచేస్తున్నారని అన్నారు. నేరాలు చేసేవారిపై ఉక్కుపాదం మోపే దిశగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, నేరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

December 26, 2024 / 07:03 PM IST

రామనామం రమ్యమైనది: రామకోటి

MDK: రామనామం శాశ్వతమైనదని, రమ్యమైనదని గజ్వేల్ రామకోటి రామరాజు వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈరోజు బెంగళూరు నుంచి సూర్య నారాయణ రావు అనే భక్తుడు ప్రత్యేకంగా వచ్చి అద్దాల మందిరంలో కొలువైన సీతారాముల పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామరాజు వచ్చిన భక్తునికి భద్రాచల సీతారాముల శేష వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు.

December 26, 2024 / 07:02 PM IST

సింగరేణి OCP-3 ప్రాజెక్టును పరిశీలించిన డైరెక్టర్

PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-2 OCP-3 ప్రాజెక్టు, మెటీరియల్ భద్రపరిచే షెడ్లను సంస్థ డైరెక్టర్(EM&0) సత్యనారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుగా అధికారులతో సమావేశమైన ఆయన ప్రాజెక్టు స్థితిగతులపై సమీక్షించారు. అనంతరం CHPలో నిర్మాణంలో ఉన్న బంకర్ పనులను పరిశీలించారు. బొగ్గు రవాణాకు అనుగుణంగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.

December 26, 2024 / 06:52 PM IST

ట్రైన్ బీట్ అధికారుల పర్యటన

MNCL: జన్నారం మండలంలోని వివిధ అటవీ ప్రాంతాలలో ఫారెస్ట్ బీట్ ట్రైనింగ్ ఉద్యోగార్డులు పర్యటించారు. ఉద్యోగ శిక్షణలో భాగంగా వారు గురువారం జన్నారం మండలంలోని బైసన్ కుంటతో పాటు జన్నారం పట్టణంలోని ఈఈసీ సెంటర్, బటర్ఫ్లై గార్డెన్, తదితర వాటిని పరిశీలించారు. అటవీ అధికారులు మాట్లాడుతూనే అడవులను కాపాడటమే లక్ష్యంగా విధులను నిర్వహించాలని సూచించారు.

December 26, 2024 / 06:43 PM IST

కార్మికులకు దోమ తెరల పంపిణీ

WGL: ఏకశిల పార్కులో పని చేస్తున్న కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికులకు దోమ తెరలు, టీ షర్టులు, చీరలను పార్క్ వాకర్స్ అసోసియేషన్ స్పాన్సర్ దేవ అరవింద్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 20 మంది ఏకశిల పార్క్, మునిసిపల్ కార్మికులకు దోమ తెరలు, టీ షర్టులు, చీరలను అందించారు. ఈ కార్యక్రమంలో పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

December 26, 2024 / 06:42 PM IST

రేపు డయల్ యువర్ డిఎం కార్యక్రమం

NRPT: డయల్ యువర్ డిఎం కార్యక్రమం రేపు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపో పరిధిలోని ప్రయాణికులు ఫోన్ ద్వారా సమస్యలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 7382826293 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

December 26, 2024 / 06:41 PM IST

సమగ్ర శిక్షా ఉద్యోగులు అరటిపండ్లు అమ్మి నిరసన

NLG: తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం 17 రోజు సమ్మెలో భాగంగా నల్లగొండ కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు అరటి పండ్లు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. ఏళ్లుగా కష్టపడి చదివినా 20 ఏళ్లు సర్వీస్ ఇచ్చినా ఉద్యోగ భద్రత లేకపోవడంతో అభద్రతాభావంలో ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సేవలను గుర్తించి డిమాండ్ చేశారు.

December 26, 2024 / 06:38 PM IST

‘జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలి’

MNCL: ఈ నెల 27 నుండి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌లలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారులు బయలు దేరుతున్న బస్సులను గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కప్- 2024 రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో రాణించాలని అన్నారు.

December 26, 2024 / 06:36 PM IST

‘ఈనెల 29వ తేదీన షాద్ నగర్ లో లంబాడాల సింహగర్జన’

MBNR: ఈనెల 29వ తేదీన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో లంబాడాల సింహగర్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎల్ హెచ్‌పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్ వెల్లడించారు. కార్యక్రమానికి లంబాడాలు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బెల్లయ్య నాయక్ పాల్గొంటారని తెలిపారు.

December 26, 2024 / 06:30 PM IST

రోడ్లు ఊడ్చి ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసన

కామారెడ్డి: సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరింది. గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సీఎం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ ఆధ్వర్యంలో చేశారు.

December 26, 2024 / 06:27 PM IST

‘బతుకమ్మ పేరుతో కోట్లు దోచుకున్నారు’

MDK: బతుకమ్మ పేరుతో సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు కోట్ల రూపాయలు దోచుకున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. చెరువులను మరమ్మత్తు చేయకుండా బిల్లులు తినేశారని మండిపడ్డారు. చెరువు మొత్తం గుర్రపు డెక్క నిండడంతో పతంగి కోసం వెళ్లి బాలుడు మృతి చెందడం బాధాకరం అన్నారు.

December 26, 2024 / 06:27 PM IST

రిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

ADB: పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులను నాయకులతో కలిసి పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అధికారులు తదితరులున్నారు.

December 26, 2024 / 06:26 PM IST

ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కళ్యాణి నియామకం

SDPT: జిల్లాలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పుల్ల కళ్యాణి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి రెండవసారి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించినందుకు కళ్యాణి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సమస్యల కోసం ఎల్లవేళల కృషి చేస్తానన్నారు.

December 26, 2024 / 06:16 PM IST

‘న్యాయవాదులు ఇ-ఫైలింగ్ చేసుకోవాలి’

NZB: నిజామాబాద్ బార్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న జిల్లా న్యాయవాదులు ఇ-ఫైలింగ్ చేసుకోవాలని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌రెడ్డి  కోరారు. గురువారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇ- కోర్టు వెబ్‌సైట్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.

December 26, 2024 / 06:10 PM IST

గీత కార్మికుల హామీలు నెరవేర్చాలి: వెంకటరమణ

NLG: కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ అన్నారు. నల్గొండలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంఘం రాష్ట్ర సదస్సు నిర్వహించి 22 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.

December 26, 2024 / 06:10 PM IST