• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఈనెల 7న పరిగిలో తైబజార్ వేలం

VKB: పరిగి పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన తైబజార్ వేలం వచ్చే ఏప్రిల్ 7 మంగళవారం ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు పురపాలక సంఘం కమిషనర్ వెంకటయ్య తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు ఏప్రిల్ 6న సోమవారం సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రచురితమైన నోటీసును సవరించి తాజా తేదీని ప్రకటించినట్లు తెలిపారు.

March 29, 2026 / 12:09 PM IST

‘ఆసుపత్రులకు అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందే’

MHBD: పెద్దవంగర మండల కేంద్రంలోని వారాహి హాస్పిటల్‌ను DMHO రవి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందించొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యులే చికిత్స అందించాలని సూచించారు. ఆస్పత్రులకు అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందేనని, అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 29, 2026 / 12:09 PM IST

మానవత్వం చాటుకున్న లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సభ్యులు

NLG: నకిరేకల్‌కు చెందిన ‘లిటిల్ సోల్జర్స్’ ఫౌండేషన్ మానవత్వం చాటుకున్నారు. అటిజంతో బాధపడుతున్న ఏడేళ్ల హయాన్ చంద్ర దీనస్థితి గురించి ఫౌండేషన్ సభ్యులు బ్రహ్మదేవర నరేష్, మట్టిపల్లి వెంకన్న.. ఆదివారం సూర్యాపేటలోని బాలుడి ఇంటికి వెళ్లి రూ.22,200 లు ఆర్థిక సాయం అందించారు. ఆపదలో అండగా నిలిచిన లిటిల్ సోల్జర్స్ సభ్యులకు బాలుడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

March 29, 2026 / 12:07 PM IST

ఈసారి కూడా ముంపు ప్రజలకు నిరాశ మిగిలింది

BDK: భద్రాచలం శ్రీ రామ నవమి వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి వరాలజల్లు కురిపిస్తారని అనుకున్న గోదావరి వరద ప్రాంత ప్రజలకు ఈసారి నిరాశే మిగిలింది. ప్రతి ఏటా వరద ముంపుకు గురై పంట నష్టం వాటిల్లుతుంటే ప్రభుత్వం ఆనకట్టలు మరమ్మతు చర్యలు చేపట్టాలని కోరారు. కానీ ఈ విషయంపై సీఎం చర్చించకపోవడం విశేషం.

March 29, 2026 / 12:05 PM IST

రేపు దుకాణాల వేలం

KNR: గన్నేరువరం గ్రామ పంచాయతీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ ఆస్తుల వేలం ఈనెల 30న ఉదయం 11 గంటలకు పంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ లచ్చినర్సు తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో 17 షెటర్లు, గ్రామ సంతను వేలంపాట నిర్వహిస్తున్నామని, ఈ వేలం పాటలో పాల్గొనదలచిన వారు రూ. 10,000 డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నారు.

March 29, 2026 / 12:02 PM IST

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం: చిన్నారెడ్డి

WNP: ఆపదలో ఉన్న పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రజా ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 168 మంది లబ్దిదారులకు రూ. 38,99,500 విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 

March 29, 2026 / 12:01 PM IST

మేడారంలో రెచ్చిపోతున్న దొంగలు

MLG: మేడారంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణంలో కిరాణా దుకాణాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. శనివారం అర్ధరాత్రి ఓ దుకాణంలో దొంగలు చొరబడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇటీవల కాలంలో మేడారంలో దొంగతనాలు ఎక్కువ అయ్యాయని వ్యాపారులు వాపోతున్నారు. పోలీసులు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

March 29, 2026 / 12:01 PM IST

ఆహ్వాన పత్రాలకు ప్రత్యేక పూజలు

BHNG: రాజాపేట మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ మండల ప్రఖండ అధ్యక్షులు జ్ఞానేందర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహక బృందం తెలిపారు. ఆదివారం ఏకాదశి పర్వదినం రోజున శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో ఆహ్వాన పత్రాలకు ప్రత్యేక పూజలు జరిగిన అనంతరం కరపత్రాల పంపిణీ చేపట్టారు.

March 29, 2026 / 12:01 PM IST

జామడలో మహిళా అభ్యాసులకు అక్షరాస్యత పరీక్షలు

ADB: నార్నూర్ మండలంలోని జామడ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం మహిళా అభ్యాసుల కోసం FLNAT/NIOS పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ చందు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని పరీక్షలు రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు.

March 29, 2026 / 12:01 PM IST

దేవరకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

NLG: దేవరకొండలో టీడీపీ 44 ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లు పంపిణీ చేసి వేడుకలని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

March 29, 2026 / 11:59 AM IST

రేపు రాములబండలో ఉచిత మెగా వైద్య శిబిరం

NLG: ‘ప్రజా పాలన ప్రగతి నివేదిక’లో భాగంగా నల్లగొండ మండలం రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం భారీ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఎండీ. అబ్దుల్ జమీర్ తెలిపారు. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 29, 2026 / 11:56 AM IST

జిల్లాలో తగ్గని అక్రమ ఇసుక రవాణ

NZB: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న ఏ చర్యలైనా నీరుగారి పోతున్నాయి. వేబిల్లు లైనా, ‘మన ఇసుక వాహనం’ ఆన్ లైన్ బుకింగులైనా పేర్లవైనా ఇసుకను అడ్డగోలుగా తవ్వేందుకు, తవ్విన ఇసుకను రహస్య స్థావరాల్లో డంపింగ్ చేసి రాత్రి వేళల్లో దర్జాగా తరలించేందుకు అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

March 29, 2026 / 11:51 AM IST

ఆరోగ్యానికి వ్యాయామం ఆవశ్యకం: సీఐ

KMM: ఆరోగ్యానికి వ్యాయామం అత్యంత ఆవశ్యకమని మధిర రూరల్ సీఐ డి. మధు అన్నారు. నేడు పట్టణంలోని ఈ- మాల్ బిల్డింగ్‌లో నూతనంగా మేడికొండ పృథ్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పృద్విజిమ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. యువతకు వివిధ పోటీ పరీక్షల్లో దేహ దారుఢ్యతకు శారీరక సౌష్ట్యానికి వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నారు.

March 29, 2026 / 11:48 AM IST

హాస్టల్లో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

MNCL: చెన్నూర్ గురుకుల పాఠశాల హాస్టల్లో 7వ తరగతి విద్యార్థిని శ్రీహిందు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. 3 రోజుల క్రితం స్నేహితులతో జరిగిన గొడవతో మనస్తాపం చెంది బాలిక పురుగు మందు తాగింది. వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 29, 2026 / 11:40 AM IST

ఆదివారం సైతం యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా

ASF: వాంకిడి మండల కేంద్రంలో ఆదివారం సైతం అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. వాగుల నుంచి ఇసుకను తరలిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం దృష్ట్యా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, ఇసుక తవ్వకాల వల్ల వాగులు ఎడారిగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలన్నారు.

March 29, 2026 / 11:39 AM IST