KMM: భద్రాద్రి రామాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం హర్షనీయమని ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ అనిత అన్నారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంత్రి పొంగులేటి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వంలో అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మరబండపాలెం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు పురోహితులు వేదాశీర్వచనాలు పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
NLG: మర్రిగూడలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు దోమల వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1982 మార్చి 29న తెలుగు జాతి ఆత్మగౌరవం, పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారని కొనియాడారు.
RR: మియాపూర్లోని చెరువులను సుందర వనాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి పెద్ద కుడి చెరువు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. భావితరాలకు ఆస్తుల కంటే మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన వాతావరణం అందించడమే తమ బాధ్యతని, ఎమ్మెల్యే సహకారంతో ఈ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
HNK: బాలసముద్రంలోని CPI జిల్లా కార్యాలయంలో CPI హనుమకొండ జిల్లా సమితి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ… పార్టీ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై CPI పోరాటాలు చేస్తుందన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద గుండ్లపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఇటీవల గుండ్లపల్లి స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటనపై టోల్గేట్ యాజమాన్యంని టోల్ ప్లార్లక్ష్యాన్ని వారు ఖండించారు. స్టేజ్ వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో నిర్వహించగా, రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
KMR: మిషన్ భగీరథ నుంచి తాగునీటి సరఫరాను ఐదురోజుల పాటు నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ సబ్డివిజన్ అధికారులు ఆదివారం పేర్కొన్నారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు. జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లోని ఆవాసాలకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఐదురోజుల పాటు ఉండదని అధికారులు తెలిపారు.
VKB: జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ కోర్టులలో మొత్తంలో లోకదాలత్లో 38,097 కేసులు రాజీమార్గంతో పరిష్కారం అయినట్లు వికారాబాద్ జిల్లా జడ్జ్ చంద్ర కిషోర్ తెలిపారు. జిల్లాలో నిర్వహించిన లోక్ దాలత్ భారీగా కేసులు రాజీమార్గంతో పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు.
WGL: పోలీస్, సీబీఐ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి, డబ్బు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని, తమ పిల్లలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కాల్స్కి భయపడకుండా, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని సూచిస్తున్నారు.
NLG: కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అని అధికారులు అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్లో నల్గొండ జిల్లాలో 13,938, సూర్యాపేట జిల్లాలో 1,849 కేసులు పరిష్కరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
ADB: ఉట్నూర్ మండలంలోని ప్రోయోబిషన్ అండ్ ఎక్సయిజ్ శాఖ బాటిలింగ్ డిపోను వెంటనే ప్రారంభించాలని LHPS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహన్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎక్స్ రోడ్డు వద్ద ధర్నా చేశారు. రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరి వారిని సముజయించారు. వీలైనంత త్వరగా డిపో నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు.
SRCL: చందుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా శక్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉల్లాస్ యాప్లో రిజిస్టర్ అయిన లెర్నర్స్కి ఆదివారం పరీక్షలు నిర్వహించారు. అన్ని గ్రామాలలోని ఉల్లాస్ (అమ్మకు అక్షరమాల ప్రోగ్రాం) సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించి జవాబు పత్రాలు విద్యాశాఖకి అందజేయనున్నట్టు నిర్వహకులు పేర్కొన్నారు.
వనపర్తి పట్టణంలోని మార్కెట్ యార్డు పరిసరాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. వయస్సు, దుస్తుల ఆధారంగా గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎవరికైనా సమాచారం ఉంటే 8712670612కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
NZB: ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘స్వచ్ఛ ఆర్మూర్’ కార్యక్రమం నేటితో 48వ ఆదివారానికి చేరుకుంది. సంస్థ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ నేతృత్వంలో జిరాయత్ నగర్ కాలనీలోని డివిజనల్ ఇంజనీర్ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. “ప్రతి ఆదివారం ఒక గంట” అనే నినాదంతో ఈ ఉద్యమం విజయవంతంగా సాగుతోందన్నారు.
SRPT: నేరేడుచర్ల పట్టణంలోని SKS ఫంక్షన్ హాల్లో ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయి ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ – 2026’ శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ జీ. నేతలు రవి, సైదిరెడ్డి, భాగ్యరెడ్డి హాజరై ప్రసంగించారు.