• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కరెంటు బిల్లులు చెల్లించి సహకరించండి’

SRCL: కరెంట్ బిల్లులు సకాలంలో చెల్లించి, సంస్థ అభివృద్ధికి సహకరించాలని సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ ఛైర్మన్ చిక్కాల రామారావు వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, పరిశ్రమల రంగాలకు అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలోనూ, అభివృద్ధిలో సహకార రంగానికి స్ఫూర్తిగా సెస్ నిలిచిందన్నారు. ఈ మేరకు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 4 సభను విజయవంతం చేయగలరని కోరారు.

March 28, 2026 / 04:49 PM IST

ఆన్ లైన్ మోసం.. కేటుగాళ్లు అరెస్ట్

KMM: ఆన్ లైన్‌‌లో ట్రేడింగ్ అని నమ్మించి సుమారు రూ. 2 కోట్ల రూపాయలు మోసం చేసిన విషయం తేలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు నిందుతులను ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు పట్టణంలో అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను నిందితులను కోర్టుకు తరలించనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

March 28, 2026 / 04:43 PM IST

హనుమకొండ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

HNK: కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌ను నవతెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ వినతి పత్రం అందజేశారు. హనుమకొండ జిల్లాలో దివ్యాంగులకు కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుని దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి. అజీమ్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.

March 28, 2026 / 04:43 PM IST

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్

ADB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు ఆపద సమయాల్లో ధైర్యంగా తలపడేలా, వారి రక్షణకు వారే పూనుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ మేరకు శిక్షణ పొందుతున్న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.

March 28, 2026 / 04:42 PM IST

హనుమాన్ శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని DSPకి వినతి

ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఏప్రిల్ 2న నిర్వహించనున్న వీర హనుమాన్ శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు శనివారం DSP వహీదుద్దీన్‌ను కలిసి విన్నవించారు. ఈ కార్యక్రమ వివరాలను వివరించి పోలీసుల సహకారం కోరారు. అనంతరం CI ప్రేమ్ కుమార్‌కు భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై వినతిపత్రం సమర్పించారు. సీఐని కలిసిన వారిలో మంచ్ సభ్యులు ఉన్నారు.

March 28, 2026 / 04:41 PM IST

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

SRD: భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంది మండలం జిలకర గ్రామంలో శనివారం జరిగింది. గత జనవరిలో భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీన్ని తట్టుకోలేని భార్య మమత (28) ఇద్దరు పిల్లలు మణికంఠ (7), ప్రళయ (5) లకు విషం ఇచ్చింది. అనంతరం మమత ఉరి వేసుకొని మరణించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

March 28, 2026 / 04:41 PM IST

గ్రామాల్లో అక్రమంగా చెట్ల నరికివేతపై ఆందోళన

NRPT: ఊట్కూరు మండలంలోని పులిమామిడి, బిజ్వార్, అసులోనిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో అక్రమంగా చెట్ల నరికివేత సాగుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే చెట్లను నరికి, రాత్రి సమయాల్లో కలపను రహస్యంగా తరలిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

March 28, 2026 / 04:40 PM IST

మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 అంచనా బడ్జెట్ ఆమోదం

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 సంవత్సర అంచనా బడ్జెట్ కౌన్సిల్ సమావేశం మేయర్ మధుకర్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సాధారణ ఆదాయం 5037.58(రూ. లక్షలలో), క్యాపిటల్ ఆదాయం గ్రాంట్లు డిపాజిట్లు, అడ్వాన్స్‌లు రూ.2438.56 కాగా ప్రతిపాదించిన మొత్తం బడ్జెట్ రూ.7476.14, మిగులు బడ్జెట్ కింద రూ.889.52 ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను BJP, BRS పార్టీలు వ్యతిరేకించాయి.

March 28, 2026 / 04:38 PM IST

ఈ నెల 31న ఉద్యోగ మేళ

MBNR: ఈ నెల 31న పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో 500 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రి ప్రియ తెలిపారు. టెన్త్ లేదా అంతకంటే ఎక్కువ చదివి, 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్న యువతీ యువకులు అర్హులన్నారు. విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డుతో ఈ మేళాకు హాజరుకావాలని ఆమె సూచించారు.

March 28, 2026 / 04:37 PM IST

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పరిశీలన

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి శనివారం పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎటువంటి రాజీ పడకూడదని, విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు.

March 28, 2026 / 04:35 PM IST

జెకేసారంలో ఎండిన పంటలు..

BHNG: చౌటుప్పల్ మండలం జెకేసారం గోకారం చెరువు, బోర్లు అడుగంటడంతో 150 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. ‘ఇంటింటికి సీపీఎం’లో భాగంగా ఇవ్వాళ పొలాలను పరిశీలించిన CPM నేతలు కృష్ణారెడ్డి, కిష్టయ్య.. ధర్మారెడ్డి పల్లి కాలువ పనుల జాప్యం వల్లే ఈ దుస్థితి అని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

March 28, 2026 / 04:30 PM IST

ప్రశాంతంగా ముగిసిన పరీక్ష: DEO

NLG: టెన్త్ పరీక్షల్లో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో బిక్షపతి తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 71 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా, రెగ్యులర్ విభాగంలో 19,718 మందికి గాను 19,664 మంది (99.73%) హాజరయ్యారు. అయితే ప్రైవేట్ విభాగంలో మాత్రం 24 మందికి గాను కేవలం 7 మంది (29.17%) మాత్రమే పరీక్షకు హాజరైనట్లు ఆయన వివరించారు.

March 28, 2026 / 04:30 PM IST

సింగరేణి ప్రైవేటీకరణపై కార్మికుల బైక్ ర్యాలీ

KMM: సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ సత్తుపల్లిలో కార్మికులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుడు జె.వి.ఆర్ విప్లవ గీతాలతో కార్మికులను ఉత్తేజపరిచారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.

March 28, 2026 / 04:30 PM IST

అదనపు కలెక్టర్‌కు మీసేవ నిర్వాహకుల విన్నపం

NZB: జిల్లాలో అనధికారికంగా నిర్వహిస్తున్న CSC సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ మీసేవ అసోసియేషన్ సభ్యులు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. CSC సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా ‘మీసేవ’ బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు. తక్షణమే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

March 28, 2026 / 04:30 PM IST

ఉపాధి హామీ పనులు పరిశీలించిన MSO

KMR: డోంగ్లి మండల ప్రత్యేక అధికారి మరియు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య శనివారం మోగా గ్రామ శివారులో సాగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధి పనులు నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఎండలు తీవ్రమవుతున్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలని ఆమె సూచించారు.

March 28, 2026 / 04:30 PM IST