SRD: సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు శనివారం నిర్వహించారు. హెల్మెట్ ధరించని ఎనిమిది మంది వాహనదారులకు జరిమానా విధించారు. ఆయన మాట్లాడుతూ.. బైక్ పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మరోసారి పట్టి పడితే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.