సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ నేరుగా ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 16 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఎస్సైలకు ఆదేశించారు.