SRD: జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీలో 11వ రోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించారు. శనివారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కార్యాలయం ముందు జేఏసీ రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డంప్ యార్డు వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘం నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.