KNR: మూడు మండలాల ప్రజల ఆకాంక్ష మేరకు బ్రిడ్జి నిర్మాణం జరగాలి లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని పలువురు నాయకులు అన్నారు. మానేరు నదిపై నిర్మించనున్న వంతెన గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాలలోని వివిధ గ్రామాల ప్రజల అభిప్రాయం మేరకు జరగాలని, రాజకీయ అవసరాల కోసం బ్రిడ్జి నిర్మాణం చేపట్టవద్దని అన్ని గ్రామాలకు సౌకర్యం కలిగే విధంగా నిర్మించాలని కోరారు.