VKB: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయద్దని ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. ఇళ్ల ఫొటోలు అప్లోడ్ చేయడానికి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆదేశాలు జారీ చేశారు. బేస్మెంట్, గోడలు, స్లాబు ఫొటోలను అప్లోడ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని స్పష్టం చేశారు.