ADB: ఆదివాసి గిరిజనులు ఇచ్చిన అన్ని అర్జీలను పరిష్కరించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా ఆదేశించారు. సోమవారం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆదివాసి గిరిజన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.