HYD: నగరంలో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు బేగంపేట ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచంద్ర రావు ఆయనకు స్వాగతం పలికారు. కాగా, రాజ్నాథ్ సింగ్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్, కొండాపూర్లో జరిగే జీటో కనెక్ట్ ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.