WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి సోమవారం మిర్చి బస్తాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో సరకుల ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.14,800 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.15,500పలికింది. అలాగే తేజ మిర్చికి రూ.14,700కి ధర వచ్చింది. వర్షాకాలం నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తూ సరకులు మార్కెట్ తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.