కృష్ణా: కంకిపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. 20 మందిలో కేవలం నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. 24 గంటల ముందే సమాచారం ఇస్తుండటంతో హాజరుకాలేకపోతున్నామని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరతపై అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎస్సీ కాలనీలో ప్రహరిగోడకు నిధులు కేటాయించాలని సభ్యులు కోరారు.