MDCL: సంక్రాంతి పండుగ వేళ స్పెషల్ బస్సుల్లో 50% చార్జీలు పెంచి వసూలు చేయడంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక అన్నోజిగూడ నుంచి ఉప్పల్ రూ.40 వసూలు చేస్తున్నారని, సాధారణ సమయాల్లోనూ గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ బస్సుల ధరలు తలకు మించిన భారంగా మారుతున్నట్లుగా పలువురు సోషల్ మీడియా వేదికగా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.