SRCL: ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ అర్బన్ మండలం చింతల్టాన గ్రామంలో మంజూరి అయిన రూ. 7 లక్షల 61 వేల విలువగల 19 సీఎం సహాయనిధి చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.