KNR: సైదాపూర్ మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ వర్మకు మంజూరైన రూ. 60 వేల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కాశవేణి రవీందర్ ఆదివారం అందజేశారు. సీఎంఆర్ఎఫ్ కష్ట సమయాల్లో ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కానుగంటి భిక్షపతి, డాక్టర్ శ్రీనివాస్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.