JN: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జనగామ మండలంలోని పెద్దతండ(ఎం) గ్రామ సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి గుగులోత్ స్వరూప, సీపీఎం బలపరిచిన అభ్యర్థి భూక్య జ్యోతిపై 330 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి గెలవడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.