MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ ఇంద్రానగర్కు చెందిన మిద్దె రవి కూతురు మిద్దె పల్లవి ఎంబీబీఎస్ 3వ సంవత్సరంలో చదువుతున్నారు. పల్లవి మెడికోకు విద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదివారం రూ. లక్ష ఆర్థిక సహాయం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అందించారు. పల్లవి కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.