PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పండుగలు, సెలవుల సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. తలుపులు, కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయా పరిశీలించాలన్నారు. సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.