KMR: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై తాము చర్చకు సిద్ధమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్లో పట్టభద్రుల ఓటర్ల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ‘ఆరు గ్యారంటీల హామీ’ చెల్లని రూపాయిగా మారిందన్నారు.