ప్రకాశం: పొదిలి పట్టణంలోని రథం బజార్లో ఉన్న సాయిబాబా దేవస్థానంలో సాయిబాబాను శనివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. గర్భగుడిలోని స్వామివారిపై 10 నిమిషాల పాటు కిరణాలు ప్రసరించాయి. ఆలయం ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్ల కమ్మల నీడను చీల్చుకుని సూర్యకిరణాలు గర్భగుడిని తాకడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.