AP: ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బందికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమాజ సేవలో ఆ ట్రస్టు 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రసంశలు కురిపించారు. ‘ఆపన్నులకు చేయూతనిస్తున్న మీ సేవా స్ఫూర్తి ప్రశంసనీయం. ఎన్టీఆర్ ఆశయాలు నెరవేరుస్తూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.