SRD: బుస్సా రెడ్డి పల్లిలోని మిషన్ భగీరథ మోటార్ల మరమ్మతుల కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 28 నుంచి 30వ తేదీ వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈ విజయలక్ష్మి తెలిపారు. మునిపల్లి, కోహిర్, జరాసంఘం, జహీరాబాద్, మొగుడంపల్లి, సంగారెడ్డి, కంది సదాశివపేట, కొండాపూర్, పటాన్ చెరు మండలాలు, తెల్లాపూర్ మున్సిపాలిటీలో నీటి సరఫరా జరగదన్నారు.