BHNG: వలిగొండ మండలం వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీలు లెక్కించారు. వివిధ హుండీల ద్వారా 90 రోజులకు గాను రూ.12,85,884 ఆదాయం సమకూరిందని ఆలయ కమిటీ ఛైర్మన్ నరేష్ కుమార్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహనబాబు తెలిపారు. ఈకార్యక్రమంలో వేద పండితులు, సిబ్బంది. భక్తులు పాల్గొన్నారు