SRCL: వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో నిన్నటి రోజు పుట్టిన నేపథ్యంలో ఫౌండేషన్ వారు ఫుడ్ పంపిణీ చేశారని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నాన్ వెజ్ ఫుడ్ను కొందరు యాచకులు,నిరుపేదలు ఆలయ ప్రాంగణంలో తీసుకువెళ్లి తిన్నారని, ఇక్కడ ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని ఎస్పీ మీడియాకు తెలిపారు. నాన్వేజ్ ఫుడ్ పంపిణీ చేసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వెల్లడించారు.