NRML: జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నవంబర్ 29న దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రన్నింగ్, షాట్పుట్జావెలిన్ త్రో, చెస్, క్యారమ్స్ పోటీల్లో జూనియర్, సీనియర్ విభాగాల వారు పాల్గొనవచ్చని, విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని వారు తెలిపారు.