బాపట్ల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని (పీ-4) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులు, వినతులు అందుకున్న ఆయన సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.