BHNG: ఇటీవల విడుదల చేసిన గ్రూపు-2 ఫలితాలలో భువనగిరి మండలం పెంచికల్ పహాడ్కు చెందిన కీ.శే.బాల్ద రాజయ్య లక్ష్మిల కూతురు అనుష రాష్ట్ర సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపిక కావడంతో.. గ్రామస్తులు అనుషను బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విజయం ద్వారా గ్రామానికీ మంచి పేరు తెచ్చిందని ప్రశంసించారు.