KMM: గత ఏడాది వరదల సమయాన ఆకేరు ప్రవాహంలో కారు కొట్టుకుపోవడంతో కారేపల్లి మండలంలోని గంగారం తండాకు చెందిన అగ్రికల్చర్ సైంటిస్టు అశ్విని, ఆమె తండ్రి నూనావత్ మోతీలాల్ మృతి చెందిన విషయం విదితమే. వీరి జ్ఞాపకార్థం అశ్విని సోదరుడు అశోక్ గుడి నిర్మించాడు. గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో గుడి నిర్మించడమే కాక అశ్విని, మోతీలాల్ విగ్రహాలను ఏర్పాటు చేశారు.