సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి సమస్య అడిగి తెలుసుకున్నారు. మొత్తం 12 మంది తమ సమస్యను ఎస్పీకి విన్నవించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైలకు ఆదేశించారు.